● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి.. | - | Sakshi
Sakshi News home page

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..

May 28 2025 11:43 AM | Updated on May 28 2025 11:43 AM

● అభి

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..

● ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ ‘వైఎస్‌’ హయాంలోనే..

సాక్షి ప్రతినిధి, కడప: మహానాడులో చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ల పరువు తీసి రోడ్డున పడేశారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డా కడపలో మహానాడు పెడుతున్నాం. ఇక అన్నీ మారిపోయాయి.. రాయలసీమ రూపురేఖలు రేపటి నుంచి మారిపోతాయి’ అంటూ తెలుగుదేశం నేతలు బీరాలు పలికారు. మహానాడు సందర్భంగా.. ఏ వేదిక దొరికినా, ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. తీరా మహానాడులో చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి అంశాన్నే పక్కన పెట్టడంతో.. టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు.

వైఎస్సార్‌, జగన్‌ చేసిన అభివృద్ధిని..

ఖాతాలో వేసుకునే యత్నం..

‘కడప ఇక ఎవరి అడ్డా కాదు.. టీడీపీ వారి అడ్డా’ అంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. ఈ మహానాడు రాయలసీమ రూపురేఖలనే మార్చబోతోందంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మహానాడులో రాయలీసీమ అభివృద్ధికి తమ అధినేత చంద్రబాబు ఎన్నెన్నో ప్రకటనలు చేయబోతున్నారంటూ.. మీడియా ముందు ఊదరగొట్టేశారు. మరో అడుగు ముందుకు వేసి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు కడప జిల్లాలో చేసిన అసామాన్యమైన అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకున్నారు. సీమ, కడపను అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యం అంటూ గొప్పగా డప్పాలు కొట్టుకున్నారు. తీరా మహానాడు ప్రారంభమైంది. తమ అధినేత చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో పాత చింతకాయపచ్చడి ప్రసంగాన్ని బయటకు తీశారు. గత పదిహేనేళ్లుగా చెబుతున్న.. ‘రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తా, ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా మారుస్తాను’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ముగించేశారు. వెరసి తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. తమ అధినేత రాయలసీమ అభివృద్ధికి ఎన్నెన్నో చేస్తారని, కనీసం మాటలైనా చెప్తారని ఆశపడ్డ సీమ నేతలకు చంద్రబాబు ప్రసంగం మింగుడుపడటం లేదు.

పైడిపాలెం ప్రాజెక్టును కూడా..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. జిల్లాలో చెప్పుకొనేందుకు కూడా ఆయన చేపట్టిన ప్రధాన అభివృద్ధి అంటూ లేదు. పైగా మంజూరైన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తరలించారు. ఆ స్థానంలో హజ్‌హౌస్‌ మంజూరు చేశారు. చెప్పుకునేందుకు నిర్ధిష్టమైన అభివృద్ధి అంటూ ఏదీ లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైడిపాలెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించినప్పటికీ.. ఆ పనులను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 95 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అంతకు మించి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు అస్కారమే లేదని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

పథకం పేరు పూర్తి చేసిన వారు ప్రారంభించిన వారు

రాయలసీమ అభివృద్ధి కాదు కదా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వాటిని కొనసాగిస్తానన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరో వైపు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గతంలో చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు సంగతేంటని వారు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఆ విషయాన్నే మాట్లాడలేదు. దీనికి తోడు ఇప్పటికే పులివెందులకు వచ్చిన 50 మెడికల్‌ సీట్లను వెనక్కు పంపడం, కొప్పర్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతి తరలించుకుపోవడం, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాజధానికి తరలించుకుపోవడం వంటి అంశాలపై రాయలసీమ ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంచుతానని మైదుకూరు సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన అమృత్‌ స్కీంలో భాగంగా రూ.500 కోట్లతో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు, కడపలో నిర్మిస్తున్న ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ నిధులు వంటి ఎన్నో అంశాలను చంద్రబాబు ప్రస్తావించనే లేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఏదో అత్యుత్సాహంలో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని మంత్రులు, ఎమ్మెల్యేలు బీరాలు పలికితే.. వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు పోశారు. ఇప్పుడు రాయలసీమ వాసులకు ఏం సమాధానం చెప్పాలో అంటూ తెలుగు తమ్ముళ్లు లోలోన మథన పడిపోతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

కడప అభివృద్ధి కోసం పసుపు పండుగని చెప్పుకొచ్చిన టీడీపీ

సీఎం చంద్రబాబు ప్రసంగంలో నోచుకోని ప్రణాళికలు

ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టిన వైనం

ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యత

యోగిమేమన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలు, ట్రిపుల్‌ఐటీ, రిమ్స్‌ మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు మంజూరు చేసి పూర్తి చేశారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాన్సర్‌ హాస్పిటల్‌, సూపర్‌ సెష్పాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, పుష్పగిరి ఐ హాస్పిటల్‌, డాక్టర్‌ ఎల్వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌, ఆర్కిటెక్చర్‌ పైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, పులివెందులలో మెడికల్‌ కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేశారు. చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ జిల్లాలో లేకపోవడం గమనార్హం.

గండికోట ప్రాజెక్టు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డాక్టర్‌ వైఎస్సార్‌

వామికొండ ప్రాజెక్టు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డాక్టర్‌ వైఎస్సార్‌

సర్వారాయసాగర్‌ ప్రాజెక్టు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డాక్టర్‌ వైఎస్సార్‌

వెలుగల్లు ప్రాజెక్టు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డాక్టర్‌ వైఎస్సార్‌

బ్రహ్మంసాగర్‌ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోనియాగాంధీ

పైడిపాలెం ప్రాజెక్టు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చంద్రబాబునాయుడు

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి.. 1
1/2

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి.. 2
2/2

● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement