హత్యాచార ఘటన నిందితుడిని శిక్షిస్తాం | - | Sakshi
Sakshi News home page

హత్యాచార ఘటన నిందితుడిని శిక్షిస్తాం

May 25 2025 7:24 AM | Updated on May 25 2025 7:24 AM

హత్యాచార ఘటన నిందితుడిని శిక్షిస్తాం

హత్యాచార ఘటన నిందితుడిని శిక్షిస్తాం

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని మైలవరం మండలం ఏ.కంబాల దిన్నెలో మూడేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల చిన్నారితో నిందితుడు రహమతుల్లా మృగంలా ప్రవర్తించడం దారుణమన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ను ఫోనో ఆదేశించారు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపిన మంత్రి, ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు. నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు.

హత్యాచార ఘటనపై ఎస్పీ సీరియస్‌

జమ్మలమడుగు : చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ అశోక్‌కుమార్‌ బాధితురాలు తల్లికి హామీ ఇచ్చారు.శనివారం ఆయన పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మైలవరం మండలంలోని ఎ.కంబాలదిన్నె గ్రామంలో జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావుతో కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడు తూ జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement