
బాలుడికి పాము కాటు
జమ్మలమడుగు : పెద్దముడియం మండలం చిన్న పసుపల గ్రామానికి చెందిన పూజిత్ రెడ్డి అనే విద్యార్థికి పాము కాటు వేసింది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు బాలుడిని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూజిత్రెడ్డి తల్లి, నాయనమ్మలు గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పనుల కోసం వెళ్లారు. ఇంటి వద్ద ఒక్కడు ఉండలేక పూజిత్రెడ్డి సైతం తల్లితోపాటు ఉపాధిహామీ పనులకు వెళ్లాడు. పనులు చేస్తుండగా పొలంలో ఉన్న విష పురుగు బాలుడిని కాటు వేసింది. వెంటనే హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వచ్చి వైద్యం చేయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, గిరిధర్రెడ్డిలతోపాటు గ్రామ నాయకులు విష్ణువర్దన్రెడ్డిలు ఆసుపత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి చిన్నపిల్లల వైద్యుడు సుధాకర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ వివరించారు.
జైలులో క్షుణ్ణంగా
తనిఖీలు చేస్తాం
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలోకి వెళ్లే ప్రతి వస్తువును, విధులకు హాజరయ్యే ప్రతి అధికారి, సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని కడప కేంద్ర కారాగారం ఇన్చార్జి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సాక్షి’లో ‘కారాగారంలో కాసుల కుక్కుర్తి’ అనే శీర్షికన ప్రచురితమైన వార్తపై ఆయన స్పందించారు. తనిఖీల సమయంలో దొరికిన సెల్ఫోన్లు పోలీస్ స్టేషన్లో అప్పగించడంతో పాటు బాధ్యులైన వారిపై చర్యల కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. పెట్రోలు బంకులో అన్ని లావాదేవీలు ఆన్లైన్లో కొనసాగుతాయన్నారు.