
నిరాశ్రయులకు మరో మూడేళ్లు వసతి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్ కాంప్లెక్స్లో ఉంటున్న నిరాశ్రయులకు మరో మూడేళ్లపాటు వసతి కల్పిస్తామని జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి హామీ ఇచ్చారు. శ్రీ విజయ సేవా సమితి కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి బుధవారం జెడ్పీ చైర్మన్ను కలిసి నిరాశ్రయులకు వసతి సౌకర్యాన్ని పొడిగించాలని కోరారు. ఇందుకు జెడ్పీ చైర్మన్ పై విధంగా స్పందించారు. పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వసతి గృహాన్ని సందర్శించగలనని తెలిపారు.
ప్రశాంతంగా పాలిసెట్
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించిన పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని కడప, పొద్దుటూరులలోని 16 కేంద్రాలలో నిర్వహించిన పరీక్షకు 8268 మంది విద్యార్థులకు 7271 మంది హాజరుకాగా 997 మంది గైర్హాజరయ్యారు. ఇందులో కడపలోని 12 పరీక్షా కేంద్రాల్లో 3309 మంది హాజరుకాగా 644 మంది గైర్హాజరయారు. పొద్దుటూరులోని 04 పరీక్షా కేంద్రాల్లో 3962 మంది హాజరకాగా 353 మంది గైర్హాజరైయారు. పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, జిల్లా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ దామోదరంలు కడపలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఏర్పాట్లును పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు, సలహాలను ఇచ్చారు.ఈ సందర్భంగా పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష జరిగిందని, తెలిపారు. విద్యార్థులంతా నిర్ణీత సమయంలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని చెప్పారు.
మైనారిటీలకు సబ్సిడీ రుణాలు
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి కడప జిల్లాలోని మైనారిటీ, క్రిస్ణియన్ వర్గాలకు సబ్సిడీ రుణాల కోసం మే 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటిట్ డైరెక్టర్ డాక్టర్ వి. బ్రహ్మయ్య తెలిపారు. మైనారిటీలకు లక్ష నుంచి రూ. 8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారీటీలకు లక్ష నుంచి రూ. 5 లక్ష లవరకు రుణాలు అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందని తెలిపారు. అర్హత కలిగిన వారు https:// apobmma.apcfss.in వెబ్సైట్ల్లో దరఖాస్తు చేసుకవాలని తెలిపారు. ఇందుకు మే 25 వరకు గడువు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు 9290448452, 08562–241137 నంబర్లలో సంప్రదించాలని బ్రహ్మయ్య తెలిపారు.
భద్రకాళీసమేతుడికి
చందన అలంకారం
రాయచోటి టౌన్ : అక్షయ తృతీయ సందర్భంగా రాయచోటిలోని వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు చందన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అ ధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. స్వా మి, అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయంలో వెలసిన శ్రీ బసవ దేవుడికి బసవ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నర్సరీ పరిశీలన
సిద్దవటం : సిద్దవటం లోని అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలను బుధవారం సాయంత్రం కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో ఇంకొన్ని మొక్కలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ప్లాంటేషన్ను మరింతగా అభివృద్ధి చేసి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు డీఎఫ్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ కె. ఓబులేస్, టెక్నికల్ అసిస్టెంటు రమణ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

నిరాశ్రయులకు మరో మూడేళ్లు వసతి

నిరాశ్రయులకు మరో మూడేళ్లు వసతి