
ఇందిరమ్మ ఇంటికి రూ.5లక్షలు సరిపోవు
చౌటుప్పల్ రూరల్: ‘గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పేదలకు ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. ప్రజాప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే లక్షలాది మందికి సొంతింటి కల సాకారం చేసింది. అయితే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోవు. 400–600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇల్లు నిర్మించాలనే నిబంధనలు కూడా ఇబ్బందిగా మారాయి. అల్లుడు,బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలి.. కాబట్టి చదరపు అడుగుల విస్తీర్ణం నిబంధన వద్దు’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ, సంస్థాన్నారాయణపురం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో మంజూరు పత్రాలు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం గొప్పదంటూనే అందులోని నిబంధనలపై ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలైందో లేదో కంపెనీలు సిమెంట్ ధర పెంచాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ తయారీకి కావాల్సిన సున్నపురాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సరిపడేంత ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేసేలా కంపెనీల యజమానులతో మాట్లాడేందుకు కృషి చేస్తానని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. ఇప్పటికే 3,500 ఇళ్లు మంజూరు చేయించానని, రానున్న మూడున్నర ఏళ్లలో పది వేల ఇళ్లు ఇచ్చి మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుండటం శుభ పరిణామం అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు.
ఫ 400–600 విస్తీర్ణం నిబంధనలూ ఇబ్బందిగా మారాయి
ఫ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతా..
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
మాకంటే మీరే ఎక్కువ మాటలు చెప్తారు..
చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ, నారాయణపురం మండలాలకు 1,344 ఇళ్లు కేటాయించినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈనెల 9 నుంచి మూడాలు ఉన్నాయని, ఆలోపు బేస్మెంట్ వరకు ఇల్లు నిర్మించుకుంటే ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామని లబ్ధిదారులకు సూచించారు. కలెక్టర్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని కలెక్టర్కు మైక్ ఇస్తే మా రాజకీయ నాయకులు కంటే మంచి ప్రసంగం,ఎక్కువ మాటాలు చెప్తారని అనడంతో లబ్ధిదారులు, అధికారులు నవ్వులు చిందించారు. ఏసీపీ పటోళ్ల మధుసూధన్రెడ్డి పర్యవేక్షణ, సీపీ మన్మధకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఆర్డీఓ శేఖర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఎంపీడీఓ సందీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్రెడ్డి, వీరమల్ల భానుమతి, బుజ్జినాయక్, మున్సి పల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు, నారాయణపురం మాజీ ఎంపీపీ గుత్తా ఉమాప్రేంచందర్రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పబ్బు రాజుగౌడ్, మన్నె నర్సింహారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.