
‘పది’లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లు
భువనగిరి టౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 67 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇస్తామని పరీక్షలకు ముందు కలెక్టర్ హనుమంతరావు ప్రకటించిన విషయం తెలిసిందే. సైకిళ్లను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సీఎస్ఆర్ నిర్మాణ సంస్థ సహకారంతో సమకూర్చారు.
డీఈఓకు సన్మానం
టెన్త్ ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన డీఈఓ సత్యనారాయణను శాసన మండలి చైర్మన్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్కుమార్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు పాల్గొన్నారు.

‘పది’లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సైకిళ్లు