
వేసవి ఆటలకు వేళాయే..
క్రీడా శిబిరాలు
ఏర్పాటు చేసిన ప్రాంతాలివే..
వాలీబాల్: వలిగొండ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (పి.సాయికుమార్), మల్లాపూర్ జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (వినోద్కుమార్), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (సుక్క గిరిబాబు), శారాజీపేట జెడ్పీహెచ్ఎస్ శిక్షకుడు (మధుసూదన్).
ఖోఖో: వలిగొండ (మత్య్సగిరి), మర్యాల (కె.గోపాల్), అనాజీపురం జెడ్పీహెచ్ఎస్, (ఆంజనేయులు).
అథ్లెటిక్స్: మర్యాల, శిక్షకుడు (సునీల్)
తైక్వాండో: జూలూరు జెడ్పీహెచ్ఎస్, శిక్షకుడు (కృష్ణ), నారాయణపురం జెడ్పీహెచ్ఎస్,
శిక్షకుడు (భరత్కుమార్).
భువనగిరి: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు వెలికి తీసేందుకుగాను ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో గురువారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగనున్నాయి. ఇప్పటికే జిల్లా యువజన క్రీడల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శిక్షకుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించి 10 మందిని ఎంపిక చేశారు. వీరికి ఈ నెల 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు.
రూ.50వేల నిధులు
క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ. 50వేలు రానున్నాయి. ఇందులో క్రీడా సామగ్రి కొనుగోలు, ప్రథమ చికిత్సకు రూ.10వేలు, ఒక్కో శిక్షకుడికి రూ. 4వేల చొప్పున 10 మందికి రూ. 40వేలు రానున్నాయి. శిబిరాల నిర్వహణకు చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. యువజన క్రీడల సర్వీసుల అధికారి నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తారు.
వీళ్లు అర్హులు: శిబిరాల్లో 14 ఏళ్ల లోపు బాలబాలికలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ శిబిరాల్లో నాలుగు రకాల క్రీడలు ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఇందులో ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్ ఉన్నాయి.
ఆన్లైన్లో నమోదు: శిబిరాలకు వచ్చే విద్యార్థుల వివరాలు గతంలో శిక్షకులు నమోదు చేసుకునే వారు. ఇందుకోసం ప్రత్యేకంగా హాజరు రిజిస్టర్ నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి క్రీడాకారుల వివరాలు సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. పోటీల్లో ప్రతిభ ప్రదర్శించిన క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది.
నేటి నుంచి విద్యార్థులకు క్రీడా శిక్షణ
ఫ జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు ఏర్పాటు
ఫ 14ఏళ్లలోపు బాలబాలికలకు అవకాశం