
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫోటోభూదాన్పోచంపల్లి : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ఆదివారం భూదాన్పోచంపల్లి, జూలూరులో కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 372 కొనుగోలు కేంద్రాలకు గాను 342 కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. జూలూరు, బీబీనగర్ మండలం రాఘవాపూర్లో పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించినా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో సెంటర్ల బాధ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీడ, తాగునీటి సౌకర్యం కల్పించడంలో నిర్లక్ష్యం కన్పించందన్నారు. ఎండల దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో దాతల సహకారంతో చల్లని నీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోళ్లపై రోజువారీగా అధికారులతో సమీక్ష చేస్తున్నట్లు వెల్లడించారు. ఈసారి బిహార్ హమాలీలు సరైన సమయానికి రాకపోవడంతో ధాన్యం కాంటా చేయడం ఆలస్యమైందన్నారు. ధాన్యం కాంటా చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్, ఇంచార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, ఏఎస్ఓ రోజా, డీటీ సీఎస్ బాలమణి, ఏఓ శైలజ, పీఏసీఎస్ సీఈఓ సద్దుపల్లి బాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు