
20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత
నరసాపురం రూరల్: ఇరవై రోజుల తర్వాత మృతదేహాన్ని బంధవులకు రైల్వే పోలీసులు అప్పగించారు. వివరాల ప్రకారం.. నరసాపురం మండలం సీతారాంపురం సౌత్ నేతల వారి పేటకు చెందిన నేతల అనిల్ కుమార్ (20) స్థానికంగా ఓ బేకరిలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అయితే ఇటీవల మెరుగైన జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన అనిల్ కుమార్ ఇరవై రోజుల క్రితం తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. మృతుని బంధువులు విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా 20 రోజుల తర్వాత అనిల్కుమార్ మృతదేహాన్ని గుర్తించి శనివారం కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు అప్పగించారు.
మహిళకు గాయాలు
పాలకోడేరు: మోటార్సైకిల్ సడన్బ్రేక్ వేయడంతో వెనక కూర్చున్న మహిళ అకస్మాత్తుగా కింద పడి గాయాలపాలైంది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. అంతర్వేది దేవి(62) అనే మహిళ పింఛన్ తీసుకుని తన కుమారుడి మోటార్సైకిల్పై వస్తుంది. గొల్లలకోడేరు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించేందుకు మోటార్సైకిల్ సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న ఆమె రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. అదే సమయంలో కారు డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేయడంతో కారు అడ్డం తిరిగి పక్కనే ఉన్న పంట బోదెలోకి దూసుకుపోయింది. వెంటనే స్థానికులు స్పందించి కారులో ఉన్న డ్రైవర్ని బయటకు లాగారు. గాయపడిన మహిళను పాలకోడేరు 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు.
విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారు
ఉండి: ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జీ సుందర్కుమార్ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం కనీసం టెన్త్ మూల్యాంకనం కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందని ఆరోపించారు. టైన్త్ మూల్యాంకనలో ఫలితాలు అస్తవ్యస్తంగా రావడంతో విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రతి విద్యార్థికి ఫీజు చెల్లించకుండానే రీవాల్యూయేషన్ చేయించి మళ్లీ ఫలితాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత

20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత

20 రోజుల తర్వాత మృతదేహం అప్పగింత