1 నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు | - | Sakshi
Sakshi News home page

1 నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు

May 29 2025 12:48 AM | Updated on May 29 2025 1:23 AM

1 నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు

1 నుంచి రేషన్‌ షాపుల్లోనే సరుకులు

పాలకోడేరు: జూన్‌ 1 నుంచి రేషన్‌ షాపుల వద్ద నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం పాలకోడేరు మండలం శృంగవృక్షంలో రేషన్‌ షాపు నెంబర్‌ 11ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కార్డుదారులందరూ రేషన్‌ షాపులు వద్దకు వచ్చి నిత్యావసరాలు తీసుకోవాలని అన్నారు. అనుకూలమైన సమయంలో రేషన్‌ సరుకులు పొందవచ్చన్నారు. వికలాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్‌ సరుకులను అందజేయాలని డీలర్లను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement