
1 నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు
పాలకోడేరు: జూన్ 1 నుంచి రేషన్ షాపుల వద్ద నిత్యావసరాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ తెలిపారు. బుధవారం పాలకోడేరు మండలం శృంగవృక్షంలో రేషన్ షాపు నెంబర్ 11ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కార్డుదారులందరూ రేషన్ షాపులు వద్దకు వచ్చి నిత్యావసరాలు తీసుకోవాలని అన్నారు. అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు పొందవచ్చన్నారు. వికలాంగులు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకు వెళ్లి రేషన్ సరుకులను అందజేయాలని డీలర్లను ఆదేశించారు.