పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి

May 29 2025 12:47 AM | Updated on May 29 2025 1:29 AM

పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి

పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలి

ఏలూరు(మెట్రో): జీవో 23 ప్రకారం ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్‌జీవోస్‌ నాయకులు కోరారు. బుధవారం కలెక్టర్‌ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలుసుకుని బదిలీ ప్రక్రియపై విన్నవించారు. ఏపీ ఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌లో ఉన్న ఆఫీస్‌ బేరర్స్‌కి అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు, జీవోల ప్రకారం బదిలీలు చేసేలా ప్రతి శాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ స్పందిస్తూ జిల్లా రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు నాయకులు తెలిపారు. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్‌ సెక్రెటరీలకు పదోన్నతులు కల్పించాలని కోరగా, ఏఎన్‌ఎంల పదోన్నతుల ఫైల్‌ను ఆమోదించినందుకు కలెక్టర్‌కు పూలమొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు, ఎన్‌జీవోస్‌ నాయకులు, హెల్త్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement