
నాటుసారా స్థావరంపై దాడి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం సమీపంలో శుక్రవారం నాటుసారా స్థావరాలపై ఎకై ్సజ్ అధికారులు దాడి చేశారు. దాడిలో సారా తయారీకి సిద్ధంగా ఉన్న 200 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనుబాబు తెలిపారు. 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటీలో ముగిసిన వర్క్షాప్
నూజివీడు: ఆర్జీయూకేటీ, వాద్వానీ ఫౌండేషన్ సంయుక్తంగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఐదు రోజుల పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎడ్యుకేషన్పై నిర్వహించిన వర్క్షాప్ శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు వెలికితీసి, సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళ్లేలా ప్రోత్సహించడమే శిక్షణా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అధ్యాపకులు శిక్షణలో నేర్చుకున్న అంశాలకనుగుణంగా తరగతి గదిలో విద్యార్థులకు బోధించి స్టార్టప్లు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీలను స్టార్టప్లకు కేంద్రంగా మార్చాలన్నారు. ఈఈఐటీపీ డీన్ పీ శ్యామ్, యూనివర్శిటీ డీన్ శ్రావణి, ఆర్జీయూకేటీ సీఏఓ బండి ప్రసాద్, ఏఓ బీ లక్ష్మణరావు పాల్గొన్నారు.

నాటుసారా స్థావరంపై దాడి