పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి | - | Sakshi
Sakshi News home page

పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి

Apr 30 2025 12:41 AM | Updated on Apr 30 2025 12:48 AM

పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి

పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి

కై కలూరు: తాగునీటి అవసరాలకు విడుదల చేసిన పంట కాల్వల నీటిని ఆటపాక పక్షుల కేంద్రం చెరువుకు మళ్లించాలని పర్యావరణ ప్రేమికుడు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ఎస్‌.భాస్కరరావు డిమాండ్‌ చేశారు. నీరు లేక అడుగంటిన ఆటపాక పక్షుల కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నీటి కొరత కారణంగా పక్షులకు ఆహారపు కొరత ఏర్పడుతోందన్నారు. నెల రోజులుగా కేంద్రంలో బోటు షికారు నిలిచిపోడడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నా పర్యాటకులు నిరాశగా వెనుతిరుగుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు చెరువులో నీటిని నింపే ప్రయత్నం చేయాలని కోరారు.

చెల్లని చెక్కు కేసులో జైలు, జరిమానా

నూజివీడు: బాకీ తీర్మానం నిమిత్తం ఇచ్చిన చెక్కు బ్యాంకులో చెల్లని నేరానికి టి.నరసాపురం మండలం వెలగపూడికి చెందిన చింతపల్లి చక్రిసాయి రాంబాబుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ వేల్పుల కృష్ణమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం 2018 నవంబరు 18న కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మడిచర్లకు చెందిన తలకొండ గోపాలకృష్ణ, చక్రిసాయి రాంబాబుకు రూ.2 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత ఆ బాకీ తీర్చమని గోపాలకృష్ణ కోరగా, సాయి రాంబాబు రూ.1.50 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును బ్యాంకులో వేయగా సాయి రాంబాబు ఎక్కౌంట్‌లో నగుదు లేదని వెనక్కు తిరిగి వచ్చింది. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారించిన మీదట జరిమానా, జైలుశిక్ష విధిస్తూ స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ తీర్పును వెలువరించారు.

కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు

నూజివీడు: కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలయ్యాయి. 15వ వార్డులోని కృష్ణవిలాస్‌ కాలనీలో నివాసముంటున్న కౌన్సిలర్‌ హరికోటి రమాదేవిని చూసేందుకు ఆమె తల్లి విస్సన్నపేట మండలం తాతకుంట్ల మిట్టగూడెంకు చెందిన మేడా కుమారి (55) వచ్చింది. రమాదేవి ఇంటి ఆవరణలో ఉన్న కుమారిపై మంగళవారం సాయంత్రం కోతులు దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గుండెనొప్పితో ఉపాధి కూలీ మృతి

కుక్కునూరు: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన కుక్కునూరు పంచాయతీ పరిఽధిలో జరిగింది. గ్రామంలోని సంజయ్‌నగర్‌ కాలనీకి చెందిన పెంకె వెంకయ్య (55) రోజులానే మంగళవారం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిముగించుకోని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి కూలీలు ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement