
రాత్రివేళల్లో జోరుగా మట్టి తవ్వకాలు
బుట్టాయగూడెం: మండలంలోని దొరమామిడి పరిసర ప్రాంతాల్లో రాత్రివేళల్లో అక్రమ మట్టి తవ్వకాలు,, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో కొందరు కూటమి నాయకులు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుడు ఒక ట్రక్కు మట్టి కావాలంటే కనీసం అనుమతి కోసం సరైన సమాధానం చెప్పని అధికారులు, యథేచ్ఛగా మట్టి రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం పట్ల పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.