భక్తిభావంతో శాంతి నెలకొంటుంది | - | Sakshi
Sakshi News home page

భక్తిభావంతో శాంతి నెలకొంటుంది

Jun 7 2025 1:22 AM | Updated on Jun 7 2025 1:24 AM

నెక్కొండ: భక్తిభావాన్ని పెంపొందించుకొని గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని సూరిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన పెద్దమ్మతల్లి, పెద్దిరాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వారు శుక్రవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్‌ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు. ముదిరాజ్‌లు రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, నెక్కొండ పీఏసీఎస్‌ చైర్మన్‌ మారం రాము, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ఆలయం చైర్మన్‌ దుంది శ్రీనివాస్‌, నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్‌, గుంటుక సోమయ్య, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, తోట సాంబయ్య, దొమ్మటి పురుషోత్తం, మాతంగి రాజు, తదితరులు పాల్గొన్నారు.

మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement