– 10లోu
ఇటీవల పనులు ప్రారంభం..
ఈ చిత్రంలోని ఫొటోలు చూడండి. హనుమకొండలోని జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరిస్థితి. ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా పలు పనులకు రూ.3.40 లక్షలు మంజూరు చేశారు. అడ్వాన్స్గా రూ.85 వేలు (25శాతం) విడుదల చేశారు. మంజూరీ ఇచ్చి ఐదారునెలలు గడిచినా ఇటీవల పనులు మొదలెట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తయ్యేలా లేవు. ప్రధానంగా టాయ్లెట్స్ రిపేర్, తరగతి గదుల్లో పాలిష్ బండలు వేయాల్సి ఉంది. హ్యాండ్వాష్ దగ్గర పనులు చేయాల్సి ఉంది.
విద్యారణ్యపురి:
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభంకానున్నాయి. కానీ, వాటిలో చేపట్టిన పనులు కొన్నిచోట్ల పూర్తికాగా, మరికొన్నింటిలో అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకొన్ని అసలు చేపట్టనేలేదు. దీంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యాభాస్యం సాగించాల్సి ఉంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఏయే పనులు చేపట్టాలంటే..
కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక కొన్నినెలలకే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అందులో ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు మూత్రశాలల రిపేర్లు, తరగతి గదుల్లో మైనర్, మేజర్ మరమ్మతులు చేయాలి. ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. విడుదల చేసే నిధులను పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, హెచ్ఎంల బ్యాంక్ జాయింట్ అకౌంట్(ఏఏపీసీ)లో జమ చేస్తారు.
పనులు పూర్తయినా 25శాతం నిధులే..
జిల్లాలో అక్కడక్కడ పనులు పూర్తయినా తొలుత 25శాతం అడ్వాన్స్డ్గా విడుదల చేసిన నిధులేనని, తరువాత రాలేదని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు అంటున్నారు. ఉదాహరణకు హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో మేజర్ రిపేర్, మరుగుదొడ్లు, తాగునీటి పైప్లైన్ మరమ్మతుల పనులకు రూ.10.10 లక్షల వరకు మంజూరు ఇచ్చారు. తొలుత అడ్వాన్స్గా ఇచ్చిన రూ.2.10లక్షలు మాత్రం అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ ద్వారా పనులు చేసినవారికి చెల్లింపులు చేశారు. మిగతా 75శాతం నిధులు (బిల్లులు) రావాల్సి ఉందని సంబంధిత హైస్కూల్ హెచ్ఎం నెహ్రూ తెలిపారు.
పనులు చేసినవారు నిరీక్షిస్తున్నారు..
● హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో వివిధ పనులకు రూ.4.50 లక్షల మంజూరు ఇచ్చారు. తొలుత 25శాతం నిధులు రూ.లక్షా 50వేలు విడుదల చేశారు. మిగతా పనులు పూర్తయ్యాయని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిందని సంబంధిత ఉన్నత పాఠశాల హెచ్ఎం రామారావు తెలిపారు.
● హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పనులు పూర్తయ్యాయి. ఆయా పనులకు అంచనాగా రూ.5.80లక్షలు మంజూరు ఇచ్చారు. మొదట 25శాతం నిధులు మాత్రమే విడుదల అయ్యాయని ఆ హైస్కూల్ హెచ్ఎం ఉమ తెలిపారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.
● పరకాల మండలంలోని 24 పాఠశాలలకు 72 పనులకు నిధులు మంజూరయినప్పటికి కేవలం 42 పనులు(మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ మరమ్మతులు, ర్యాంప్లు) పూర్తయ్యాయి. మరో 30 పనులు పెండింగ్లో ఉండఉన్నారు. అధికారులు బిల్లులను పెండింగ్లో పెట్టడంతో కాంట్రాక్టర్లు మరింత మొండిగా వ్యవహరిస్తూ పనులను ఆపేశారు. అయా పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించినప్పటికి పనుల్లో పురోగతి కనిపించలేదు.
మళ్లీ కాంట్రాక్టర్లకే పనులు ..
ప్రభుత్వం పాఠశాలల్లోని అమ్మ ఆదర్శ కమిటీలకు ఈ మౌలిక సదుపాయాల పనులు అప్పగిస్తే వారికి కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, వివిధ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలోని మహిళా సమాఖ్యలు తమకు సివిల్వర్క్స్ చేయించడంలో అనుభవం లేదని, ముందుగా లక్షలు పెట్టుబడి పెట్టి పనులు చేయాల్సింటుందని ముందుకు రాలేదు. దీంతో అమ్మ ఆదర్శ కమిటీలో తీర్మానం చేయించి హెచ్ఎంలు.. ఇతర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని సమాచారం. అమ్మ ఆదర్శ కమిటీలు చేపట్టనిచోట ఇతరులకు ఇవ్వొచ్చని కూడా నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్నిచోట్ల అమ్మ ఆదర్శ కమిటీల పేరుమీదే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనుభవాల దృష్ట్యా అక్కడక్కడ కాంట్రాక్టర్లు కూడా పాఠశాలల్లో పనులు చేస్తే బిల్లులు వస్తాయా.. రావోననే అనుమానంతో ముందుకురాని పరిస్థితి నెలకొని ఉంది. దీనికితోడు ఇంజనీరింగ్ విభాగం అధికారులు బిల్లులు, ఎంబీ రికార్డులు చేయడంలో కూడా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
హనుమకొండ సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో వరండాలో వేసిన పాలిష్ బండలు
న్యూస్రీల్
జిల్లాలోని 416 పాఠశాలల్లో ..
హనుమకొండ జిల్లాలో మొత్తం 508 పాఠశాలలు ఉండగా, అమ్మ ఆదర్శ పథకంకింద 438 పాఠశాలలను ఎంపిక చేశారు.
అందులో 416 పాఠశాలలకు పరిపాలనాపరమైన మంజూరీ ఇచ్చారు.
వాటిలో 1238 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.16,98,92,000 వ్యయం అవుతుందని అంచనా వేశారు.
పనులు చేపట్టిన ప్రతీ స్కూల్కు తొలుత 25శాతం నిధులు అడ్వాన్స్గా అమ్మ ఆదర్శ కమిటీలు, హెచ్ఎంల జాయింట్ అకౌంట్గా ఉన్న ఏఏపీసీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ విధంగా తొలుత రూ.4.22కోట్లు విడుదల చేశారు.
1,081 పనులు గ్రౌండింగ్ చేశారు. 991 పనులు ఇప్పటివరకు పూర్తిచేశారు. అందులో 870 పనులకు ఎంబీ రికార్డు చేశారు.
784పనులకు ఇప్పటివరకు రూ. 9,39,82,000 బిల్లులు చెల్లించినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు.
మొత్తంగా 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో 157 పనులు అసలే చేపట్టలేదని సమాచారం.
ఇంకా జిల్లాకు రూ.7.59కోట్ల నిధులు రావాల్సి ఉంది.
పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సింటుంది
పనులు మంజూరైన పాఠశాలల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి.
– బి.మహేష్,
జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్
ఐదు తరగతులకు రెండే గదులు
ఆత్మకూరు ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. ఎప్పుడో డిపెప్ పథకంలో నిర్మించిన రెండు గదుల్లో నడిపిస్తున్నాం. 70మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదనపు తరగతి గదులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఇప్పటికై నా గదులు నిర్మించాలి.
– పెండెం రాజు, హెచ్ఎం, ఆత్మకూర్ పీఎస్
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025