భూ భారతితో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యల పరిష్కారం

Jun 7 2025 1:20 AM | Updated on Jun 7 2025 1:20 AM

భూ భారతితో సమస్యల పరిష్కారం

భూ భారతితో సమస్యల పరిష్కారం

అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి

వేలేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలపై తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి అన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఏర్పాటుచేసిన భూ భారతి సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీచరలో 234 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ కోమి, డిప్యూటీ తహసీల్దార్‌ వేణుగోపాల్‌, ఆర్‌ఐ సురేందర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ హేయనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement