
భూ భారతితో సమస్యల పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి
వేలేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలపై తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఏర్పాటుచేసిన భూ భారతి సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీచరలో 234 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోమి, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ హేయనాయక్ తదితరులు పాల్గొన్నారు.