
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఏసీపీ నర్సయ్య
వర్ధన్నపేట: మతసామరస్యంతో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఏసీపీ నర్సయ్య అన్నారు. బుధవారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో బక్రీద్ పండుగ నిర్వహణపై హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై చందర్, రాయపర్తి ఎస్సై శ్రవణ్కుమార్, జఫర్గఢ్ ఎస్సై రామ్ చరణ్, పాలకుర్తి ఎస్సై మహేందర్రెడ్డి, మతపెద్దలు పాల్గొన్నారు.
ఆర్టీసీ విలీనంపై
కీలక ప్రకటన చేయాలి
నర్సంపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచి వాలయంలో నేడు (గురువారం) సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మా ట్లాడుతూ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021, 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులుజీవితాంతం రుణపడి ఉంటారన్నారు.
నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులోని గుంటూరుపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుపల్లికు చెందిన బిరెడ్డి మర్రెడ్డి అనే వ్యక్తి మెదక్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి వద్ద నుంచి పత్తి విత్తనాలను తక్కు వ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు గీసుకొండ ఏఓ హరిప్రసాద్, ఎస్సై ప్రశాంత్బాబు లు సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. ఈ తని ఖీల్లో హెచ్టీబీటీ రకం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని మర్రెడ్డి, సందీప్రెడ్డిలపై కేసు నమోదు చేశామని, మర్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, సందీప్రెడ్డి పరా రీలో ఉన్నాడని సీఐ మహేందర్ తెలిపారు.