
మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం
హన్మకొండ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని బీజేపీ నేత, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. సంకల్పంతో సాకారం అనే అంశంపై హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో ఒక్క రూపాయీ అవినీతి లేకుండా పాలన కొనసాగించారని గుర్తుచేశారు. యూపీఏ హయాం అంతా కుంభకోణాలమయమే అని ఆరోపించారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సండ్ర మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.