
మున్సిపల్ వార్డుల విభజనపై కసరత్తు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో వార్డుల విభజన దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మున్సిపాలిటీలో ఆరు గ్రామాల విలీనంతో 24 వార్డుల నుంచి ఆ సంఖ్య 30కి చేరనుంది. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సంబంధిత సమాచారాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద కు పంపనున్నారు. ఆయా గ్రామాల భౌగోళిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు. గురువారం నుంచి ఏడు రోజులపాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు, సూచనలను అధికారుల ఆమోదం కోసం కలెక్టర్ ఎదుట ఉంచి, అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కు పంపించనున్నారు. చివరగా ఈనెల 21న తుది నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
నర్సంపేట మున్సిపాలిటీలో
30కి చేరనున్న వార్డుల సంఖ్య