
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
● ఆర్డీఓ సత్యపాల్రెడ్డి
గీసుకొండ/పర్వతగిరి/రాయపర్తి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి అన్నారు. పర్వతగిరి మండలంలోని తురకల సోమవారం, జమాల్పురం, రాయపర్తి మండలంలోని గన్నారం, తిర్మలాయపల్లి, గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభలో ఆయన మాట్లాడారు. పరిష్కారం కాని తమ భూ సమస్యలపై రైతులు గ్రామసభల్లో లిఖితపూర్వకంగా దరఖాస్తు రూపంలో ఇస్తే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గీసుకొండ, పర్వతగిరి, రాయపర్తి తహసీల్దార్లు రియాజుద్దీన్, వెంకటస్వామి, శ్రీనివాస్, డీటీ రవీందర్, ఆర్ఐలు సాంబయ్య, శ్రీధర్, చంద్రమోహన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.