కలుషిత నీరు, ఆహారంతో వ్యాధులు | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు, ఆహారంతో వ్యాధులు

Jun 4 2025 1:08 AM | Updated on Jun 4 2025 1:08 AM

కలుషిత నీరు, ఆహారంతో వ్యాధులు

కలుషిత నీరు, ఆహారంతో వ్యాధులు

ఐనవోలు: వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు వస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. మంగళవారం ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన దంపతులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, సురక్షిత గర్భస్రావం గురించి తెలియజేయాలని ఆశాలకు సూచించారు. అదేవిధంగా వర్షాకాలం సందర్భంగా దోమలు, ఈగల వ్యాప్తిని నిరోధించాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. సురక్షితమైన సాధారణ ప్రసూతి సేవలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాసరావు, పల్లె దవాఖానా వైద్యాధికారులు డాక్టర్‌ సరిత, డాక్టర్‌ పర్వీన్‌, పీహెచ్‌ఎన్‌ విజయలక్ష్మి, హెచ్‌ఈఓ శ్రీనివాస్‌, నర్సింగ్‌ అధికారులు సరిత, రోజ, సుజాత, మమత, హెల్త్‌ సూపర్‌వైజర్లు రమాదేవి, శ్రీనివాస్‌, మార్గరెట్‌, స్వరూపరాణి, శ్రీధర్‌, కృష్ణమూర్తి, సతీశ్‌, నవీన్‌, ఆశాలు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ అప్పయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement