ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

Jun 3 2025 6:54 AM | Updated on Jun 3 2025 6:54 AM

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం

గీసుకొండ: గ్రేటర్‌ వరంగల్‌ నగరం 15వ డివిజన్‌ గొర్రెకుంటలో కాకతీయుల కాలం నాటి పురాతన శ్రీ నీలకంఠేశ్వర(శివ)ఆలయం శిథిలావస్థకు చేరుకోగా.. ఇటీవల రూ.30 లక్షల విరాళాలు సేకరించి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పార్వతీదేవి, నందీశ్వర, నవగ్రహ విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలను నిర్వహించారు. దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈకార్యక్రమాల్లో చివరి రోజు సోమవారం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజారి ప్రవీణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాల్లో ఆలయ పునర్నిర్మాణ కమిటీ బాధ్యులు కొండేటి కొమురారెడ్డి, కందుల శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌, కుమార్‌, రాము, రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనభోజనానికి వెళ్లడానికి నిర్ణయించారు.

వైభవంగా శివపార్వతుల కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement