
సాగుకు సమాయత్తం..
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
– 8లోu
సాక్షి, వరంగల్: వారం రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఓవైపు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అవస్థలు పడుతుండగా.. ఇంకోవైపు వర్షాలు రావడంతో పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు వరి పండించేందుకు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ట్రాక్టర్తో ఫ్లవ్ వేసి, రోటవేటర్ చేసి పత్తి విత్తనాలు కొన్ని మండలాల్లో విత్తుతున్నారు. మరికొందరు రైతులు ఇప్పటికే కురిసిన వర్షంతో దుక్కి దున్ని విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం చాలామంది రైతులు వరంగల్ నగరంలోని విత్తన దుకాణాలకు చేరుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో నకిలీ, నాసిరకం విత్తనాలు, ప్రభుత్వ అనుమతి తీసుకుని కంపెనీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. కలెక్టర్ సత్యశారద విత్తన దుకాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విత్తనాలు కొనే ముందు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరోవైపు రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి.
3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, ఇతర ఆరుతడి పంటల విత్తనాలు విత్తుకోవడం ప్రారంభించారు. జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సాగు 3.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు ఉంటుందని, 2,90,419.50 క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉందని వ్యవసాయ అధికారులు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 1,43,803 ఎకరాల్లో వరి, 1,26,173 ఎకరాల్లో పత్తి, 9,820 ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. ఇందుకోసం యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,11,430 క్వింటాళ్లు అవసరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు 5,511 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు.
మోస్తరు నుంచి భారీ వర్షం..
జిల్లాలో బుధవారం కూడా వర్షం దంచికొట్టింది. ఖిలావరంగల్లో 80.4 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 69.2 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. వరంగల్లో 58.6, నల్లబెల్లిలో 55.2, ఖానాపూర్లో 51, చెన్నారావుపేటలో 50.2, వర్ధన్నపేటలో 40.2, గీసుకొండలో 34.4, నర్సంపేటలో 31.4, రాయపర్తిలో 28.4, నెక్కొండలో 24.4, పర్వతగిరి, సంగెంలో 21.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ విభాగాధికారులు వెల్లడించారు.
న్యూస్రీల్
విత్తనాలు విత్తడం షురూ..
దుగ్గొండి: మండల పరిధి నాచినపల్లి, పొనకల్, తొగర్రాయి, గిర్నిబావి, మందపల్లి, చాపలబండ, అడవి రంగాపురం, పీజీతండా, రాజ్యతండా గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. బుధవారం పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు.
కొనేముందు ఇవి చెక్ చేసుకోవాలి..
విత్తన ప్యాకెట్పై ధర ఎంత ఉందో చూడాలి.
బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు
చేయవద్దు.
షాపు యజమానులు రైతులు అడిగిన విత్తనాలు లేవని అదేపేరుతో ఉన్న మరో విత్తన ప్యాకెట్ ఇస్తామంటారు. అలాంటి ప్యాకెట్లు తీసుకోవద్దు. షాపు యజమానులు రైతులను తప్పుదోవ పట్టిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవచ్చు
ప్యాకెట్పై ఉన్న ధర కంటే ఎక్కువ చెబితే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
లైసెన్స్ ఉన్న షాపు వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
జిల్లాలో ఈ ఏడాది 3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా..
వర్షాలు ముందుగా రావడంతో సిద్ధమైన అన్నదాతలు
దుక్కులు దున్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం
ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తిన కొందరు రైతులు
ఇంకొందరు విత్తనాల కోసం దుకాణాలకు క్యూ
నాసిరకంతో జాగ్రత్త అంటున్న
వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులు
ఏడెకరాల్లో పత్తి గింజలు వేసిన..
ఈఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయనే ఆలోచనతో దుక్కి సిద్ధం చేసుకున్నాను. ఎప్పుడు వర్షం పడితే అప్పుడే విత్తనాలు నాటేందుకు సన్నద్ధమయ్యా. మంగళవారం అచ్చు తోలుకొని సిద్ధం చేసుకున్నా. బుధవారం ఏడెకరాల్లో పత్తి విత్తనాలు నాటా. కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కలు అన్ని దక్కుతాయనే ఆశాభావం ఉంది.
– పెండ్లి మల్లారెడ్డి, మహబూబ్నగర్ గ్రామం, రాయపర్తి
విత్తనాలు కొనేముందు చెక్ చేసుకోవాలి..
విత్తన ప్యాకెట్లను కొనేముందు రైతులు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏమైనా అనుమానాలుంటే మా దృష్టికి తీసుకురావాలి. నాసిరకం విత్తనాల్ని నియంత్రించేందుకే ఇప్పటికే మా టాస్క్ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిఘా వేసి ఉంచాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉన్నాం. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..

సాగుకు సమాయత్తం..