
మూడు ముక్కలైన ట్రాక్టర్
● ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
దుగ్గొండి: ప్రమాదవశాత్తు అదుపు తప్పి గోతిలో పడిన ట్రాక్టర్ ఇంజిన్ మూడు ముక్కలైంది. బంధంపల్లి గ్రామానికి చెందిన బుస్సారి రాజుకు చెందిన సోనాలిక ట్రాక్టర్పై ప్రవీణ్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ రైతు భూమిలో దుక్కిచేయడానికి బుధవారం ఉదయం రోటోవేటర్తో వస్తున్నాడు. ఈక్రమంలో పొనకల్–లక్ష్మీపురం గ్రామాల మధ్య కొత్త చెరువు కట్ట దిగే క్రమంలో ఇంజన్ అదుపు తప్పింది. 100 మీటర్ల వరకు పంట పొలాల్లోకి వెళ్లి ఓ భారీ గోతిలో పడింది. ఇదే సమయంలో ట్రాక్టర్ను వదిలి డ్రైవర్ ప్రవీణ్ బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గోతిలో పడిన ఇంజన్ మూడు ముక్కలైంది. క్రేన్ సాయంతో బయటికి తీసి ట్రాలీలో ఎక్కించారు.
ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు
సంగెం: ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యాధికారులు, సిబ్బంది వంద శాతం చేరుకోవడానికి కృషి చేయాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని కాపులకనపర్తి, సంగెంతో పాటు 17వ డివిజన్ వసంతాపురంలోని ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు కొమురయ్య, మోహన్సింగ్, సీసీ నాగరాజు, పల్లెదవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరియపురంలో మాల్దీవ్స్ బృందం పర్యటన
గీసుకొండ/వర్ధన్నపేట: జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ మరియపురం, వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామాన్ని మాల్దీవులకు చెందిన ప్రతినిధులు బుధవారం సందర్శించారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందుతూ స్టడీ టూర్లో భాగంగా వారు గ్రామ సందర్శనకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వెచ్చింపు వివరాలు తెలుసుకున్నారు. గీసుకొండ, వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి ఆడిట్ రికార్డుల్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, బృంద సభ్యులు పాల్గొన్నారు.
‘యువ వికాసం’పై
పటిష్ట కార్యాచరణ
● వీడియో కాన్ఫరెన్స్లో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువవికాసం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. లబ్ధిదారులకు వ్యాపార నైపుణ్యాలపై సంపూర్ణ శిక్షణ ఇవ్వాలన్నారు. జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.

మూడు ముక్కలైన ట్రాక్టర్