జిల్లా మహాసభలను జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Jun 9 2025 8:02 AM | Updated on Jun 9 2025 8:02 AM

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

మదనాపురం: అమరచింతలో ఈ నెల 11న నిర్వహించే టీయూసీఐ జిల్లా మహాసభలకు కార్మికులు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌, కోశాధికారి రాజు కోరారు. ఆదివారం మండల కేంద్రంలో జిల్లా మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. టీయూసీఐ కార్మిక సంఘం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అమరచింత ఉద్యమాలకు కేంద్రంగా మారిందని.. అందుకే మహాసభలు అక్కడే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గోవర్ధన్‌రెడ్డి, రాములు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement