
ప్రజాపాలనలో భూ సమస్యలు పరిష్కారం
మంత్రి ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
చిన్నంబావి: బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఎంతోమంది రైతులను ఇబ్బందులకు గురి చేసిందని.. ప్రజా ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మంత్రి స్వగ్రామం మండలంలోని పెద్దదగడలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్నేళ్లుగా భూ సమస్యలతో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడటమేగాక ఎన్నో మానవ ఘోరాలకు భూ వివాదమే కారణం అవుతుందని తెలిపారు. దీర్ఘకాలిక భూ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి తీసుకొచ్చిందని చెప్పారు. గత పాలకులు ధరణి ద్వారా అనేక అక్రమాలకు తెర తీసారని.. వాటికి కొత్త చట్టం ద్వారా చరమగీతం పాడుతామన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయట వేయడమేగాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాయని వివరించారు. గ్రామంలో 100 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టునున్నట్లు తెలిపారు. అదేవిధంగా సర్వేనంబర్ 30లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బాషా, తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, ఎంపీడీఓ రమణారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కళ్యాణ్రావు, బీచుపల్లి యా దవ్, కృష్ణప్రసాద్ యాదవ్, విద్యాసాగర్రావు, తేజారెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, మాజీ ఎంపీటీ సీ సభ్యురాలు పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.