
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
మదనాపురం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం మండలంలోని అజ్జకొలులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించాలన్నారు. తాలు, మట్టి తొలగింపు విధానాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. ధాన్యం రవాణాలో ఆలస్యం చేయవద్దని.. అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం మండల కేంద్రంలో ధాన్యం నిల్వకు ఏర్పాటు చేసిన మార్కెట్ గోదామును పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పాపయ్య గారి కృష్ణారెడ్డి, సాయిబాబా, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు.