
ఒక పోస్టుకు 40 మంది పోటీ
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న డీఎస్సీ–2025 పోటీ పరీక్షలు శుక్రవారం ప్రారంభంకానున్నాయి.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 446 ఉపాధ్యాయ నియామకాల కోసం 18,001 మంది 34,623 దరఖాస్తులు సమర్పించారు. ఈ మేరకు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. పోస్టులు, అభ్యర్థుల పోటీని పరిశీలిస్తే ఒక్కో పోస్టుకు 40.38 మంది పోటీ పడుతున్నారు. వీరి కోసం జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో సీతం ఇంజినీరింగ్ కళాశాల, ఐయాన్ డిజిటల్ కేంద్రం, లెండీ ఇంజినీరింగ్ కళాశాల, ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, అవంతి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పూటలా పరీక్ష జరుగుతుంది. అభ్యర్ధులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా హాజరుకావాలి. హాల్ టిక్కెట్తో పాటు తప్పనిసరిగా ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలి.
నేటి నుంచి డీఎస్సీ రాతపరీక్ష
34,623 దరఖాస్తులు.. పరీక్ష
రాయనున్న 18,001 మంది అభ్యర్థులు
మొత్తం పోస్టులు 446
ఉమ్మడి విజయనగరంలో
5 పరీక్ష కేంద్రాల ఏర్పాటు