
5 నుంచి ఐటీఐలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు ఈ నెల 5 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ టీవీగిరి తెలిపారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఆయన మంగళవారం విడుదల చేశారు. విద్యార్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయించిన ర్యాంకుల బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరుకావాలని కోరారు. మొదటి విడతగా ఈ నెల 5, 6, 10వ తేదీల్లో నిర్వహిస్తున్న షెడ్యూల్లో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల ప్రారంభిస్తామని తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలను మెసేజ్ రూపంలో సెల్కు పంపిస్తామన్నారు.