ఏఓబీలో ఎకై ్సజ్‌ దాడులు | - | Sakshi
Sakshi News home page

ఏఓబీలో ఎకై ్సజ్‌ దాడులు

Apr 24 2025 8:34 AM | Updated on Apr 24 2025 8:34 AM

ఏఓబీలో ఎకై ్సజ్‌ దాడులు

ఏఓబీలో ఎకై ్సజ్‌ దాడులు

పార్వతీపురంటౌన్‌: ఒడిశా సరిహద్దు గ్రామాలైన సందుబడి, తుంబాలిభాయ్‌, పనుసత్ర గ్రామాల్లో విస్తృతంగా దాడులు జరిపి 7,700 లీటర్ల బెల్లపు ఊట, 360 లీటర్ల సారాను గుర్తించి ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ ఆఫీసర్‌ బి.శ్రీనాథుడు తెలిపారు. అలాగే 3వేల కేజీల విప్పపువ్వు, 2,400 కిలోల నల్ల బెల్లం, 3,900 కిలోల అమోనియం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎకై ్సజ్‌ శాఖ కమిషనర్‌ నిషాంత్‌ కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాహుల్‌ దేశ్‌ శర్మ ఆదేశాల మేరకు పార్వతీపురం జిల్లా ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో విజయనగరం–ఒడిశా రాష్ట్ర ఎకై ్సజ్‌ సిబ్బంది, కురుపాం, జీఎల్‌పురం పోలీస్‌ సిబ్బంది సహకారంతో విస్త్తృత దాడులు జరిపినట్లు తెలిపారు. బెల్లం ఊట, సారా, విప్పపువ్వు, నల్ల బెల్లం, అమోనియం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు వ్యక్తులపై రెండు కేసులను నమోదు చేసి అరెస్ట్‌ చేశామన్నారు. డ్రోన్‌ కెమెరాను ఉపయోగించి సారా తయారీ కేంద్రాలను గుర్తించి, దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో కురుపాం, సీతానగరం, సాలూరు, విజయనగరం, ఈఎస్‌టీఎఫ్‌ సాలూరు మొబైల్‌ పార్టీ, పార్వతీపురం మన్యం అధికారులు, సిబ్బంది, ఒడిశా ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బెల్లపు ఊట, సారా ధ్వంసం

విప్పపువ్వు, నల్లబెల్లం, అమోనియ స్వాధీనం

ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement