‘నీరు–చెట్టు’లో నిధుల దోపిడీ.. | Sakshi
Sakshi News home page

‘నీరు–చెట్టు’లో నిధుల దోపిడీ..

Published Fri, May 10 2024 7:50 PM

‘నీరు–చెట్టు’లో నిధుల దోపిడీ..

చిత్రంలో కనిపిస్తున్నది లక్కవరపుకోట మండలం తామరాపల్లిలోని చెరువు. నీరు–చెట్టు పనుల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.10 లక్షలు మంజూరు చేసింది. చెరువులో వర్షపు నీరు నిల్వ ఉండేలా మట్టితీసి గట్టును పటిష్టం చేయాలన్నది నిబంధన. ఇక్కడి నాయకులు జేసీబీలతో తవ్వి ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మేశారు. అలా రూ.15లక్షల నుంచి రూ.20లక్షల సొమ్మును జేబులో వేసుకున్నారు. కొందరు రైతులు పొలాలకు వేయాలని ప్రాథేయపడినా చెరువు మట్టిని ఇవ్వకపోవడం గమనార్హం. పోతనాపల్లి, జాకేరు, కరకవలస, కొండగంగుబూడి తదితర పంచాయతీల్లో జరిపిన చెరువు పనులదీ ఇదే పరిసస్థితి. ఇందులో ఎమ్మెల్యేకు కమీషన్లు దండిగా అందాయన్నది ఆయా గ్రామాల ప్రజల ప్రధాన ఆరోపణ.

Advertisement
 
Advertisement