జగనన్నపై నమ్మకంతో... | Sakshi
Sakshi News home page

జగనన్నపై నమ్మకంతో...

Published Wed, May 8 2024 7:00 AM

జగనన్

వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు

టీడీపీ, జనసేనలకు గుడ్‌బై చెప్పిన 200 కుటుంబాలు

పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల

విజయనగరం: ఎన్నికల సంగ్రామం దగ్గరపడుతున్న తరుణంలో అధికార వైఎస్సార్‌సీపీలోకి వలసలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు. విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 16, 46 డివిజన్‌లకు చెందిన 200 మంది పైగా కుటుంబాలు టీడీపీ, జనసేన పార్టీలను వీడి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరందరికీ కోలగట్ల కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీలో చేరిన ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులేనని, వారికి ఎళ్లవేలలా తన సహకారం ఉంటుందన్నారు. 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుజ్జల నారాయణరావు, 46 డివిజన్‌ వైఎస్సార్‌సీపీ నాయకుడు బొద్దూరు లక్ష్మణరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోలగట్ల మాట్లాడుతూ, తాము చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరడం పార్టీ విజయావకాశానికి శుభసూచికమని తెలిపారు. ఏ సమయంలో ఎటువంటి అవసరం వచ్చినా అండగా నిలబడతానని చెప్పారు. రానున్న ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గుజ్జల నారాయణరావు, బొద్దూరు లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీతోనే సంక్షేమ ఫలాలు

జగనన్నపై నమ్మకంతో...
1/1

జగనన్నపై నమ్మకంతో...

Advertisement
 
Advertisement
 
Advertisement