● ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ● టీడీపీ, జనసేన పార్టీల నుంచి 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక ● పార్టీ కండువాలు వేసి ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
విజయనగరం: గడిచిన ఐదేళ్ల సుపరిపాలనను మెచ్చి వైఎస్సార్ సీపీలో చేరిన వారంతా రానున్న ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించి, మరోమారు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్య మంత్రిగా చేయాలని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీక ర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. నగ రంలోని 5,7 డివిజన్లకు చెందిన యాతవీధి, కాపు వీధి, ఏనుగులతోట తదితర ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేనకు చెందిన 100 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో మంగళవారం చేరారు. వీరికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కండువా లు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పాలనను మరోసారి గెలిపిద్దామన్నారు. పార్టీని వీ డి వెళ్లిపోయిన వారికి వీడ్కోలు పలుకుతున్నామని, పార్టీలోకి వచ్చే వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సత్తా ఏమి టో మరోసారి రుజువుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఎస్వీవీ రాజేష్, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ ఎస్.బంగారునాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పి. మాలతి, జి.మురళి, ఎ.చాణిక్య, పార్టీ నాయకులు కేఏపీ రాజు, మాజీ కౌన్సిలర్ కె.సూర్యప్రభావతి, జోనల్ ఇన్చార్జిలు బి.ఈశ్వరరావు, పి.గోపి, నమ్మి సూరిబాబు, ఈశ్వరరావు, పైల లక్ష్మి, ధనలక్ష్మి, బొద్దాన శ్రీను, బంధపు రమణ, బొద్దాన జగదీష్ తదితరులు పాల్గొన్నారు.