
ఖైదీలకు యోగా శిక్షణ
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలోని ఖైదీలు యోగాసనాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ శిక్షణ ఇస్తున్నారు. కారాగారం లోపల ప్రశాంతమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య ఖైదీలకు యోగా నేర్పుతున్నారు. ఖైదీలకు ప్రతిరోజూ గంట పాటు యోగాసనాలు నేర్పుతున్నట్లు జైల్ సూపరింటెండెంట్ ఎం. మహేష్ బాబు శుక్రవారం తెలిపారు. ప్రతిరోజు ఖైదీలు యోగ సాధనలో పాల్గొంటున్నారని, దీని వల్ల వారి శరీర దృఢత్వంతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం నాటికి జైలులో ఉన్న అందరి ఖైదీలతో యోగాసనాలలో పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు.