నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు

Jun 1 2025 12:54 AM | Updated on Jun 1 2025 1:09 AM

నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు

నిబద్ధతకు మారుపేరు మల్లికార్జునరావు

మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజినీర్‌గా విశేషమైన సేవలందించిన సీహెచ్‌ మల్లికార్జునరావుకు జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌.వి.రమణ ఘన వీడ్కోలు పలికారు. జిల్లా సమాచార కార్యాలయంలో శనివారం జరిగిన మల్లికార్జునరావు ఉద్యోగ విరమణ సభలో రమణ మాట్లాడారు. మల్లికార్జునరావు తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో నిబద్ధతతో, సంయమనంతో పనిచేశారని కొనియాడారు. ప్రాంతీయ సమాచార ఇంజినీర్‌ కార్యాలయం సూపరింటెండెంట్‌ అన్నమ్మ మాట్లాడుతూ మల్లికార్జునరావు సున్నిత మనస్కుడని, అదే సమయంలో తన బాధ్యతల పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండేవారన్నారు. డివిజనల్‌ పీఆర్వో నారాయణరావు మాట్లాడుతూ మల్లికార్జునరావు తన వృత్తికి అంకితమయ్యారని కొనియాడారు. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ బాలాజీ, ఏపీఆర్వో శ్రీనివాసరావు, ఏవీఎస్‌ వెంకట్రావు, సీనియర్‌ అసిస్టెంట్‌ మాధవి, పీఆర్వో కిశోర్‌, పాత్రికేయులు శ్రీనివాసరావు, భగవాన్‌ తదితరులు మల్లికార్జునరావు చేసిన సేవలను ప్రశంసించారు. అనంతరం మల్లికార్జునరావు దంపతులను ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement