
క్రీడలతో క్రమశిక్షణ
మద్దిలపాలెం: క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని ఎమ్మెల్యేలు గణబాబు, గౌతు శిరీష అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికై న డాక్టర్ డి.భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై న డి.ప్రసన్న కుమార్ సత్కార కార్యక్రమం శనివారం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో విశాఖ తన స్థానాన్ని పదిలం చేసుకుంటోందన్నారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్నకుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం ఎంతో గర్వకారణమన్నారు. విశాఖ నగరానికి, చేపట్టిన పదవులకు మరింత పేరు తెచ్చే విధంగా కృషి చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లను ఎమ్మెల్యేలు సత్కరించారు. విశాఖ జిల్లా రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ చంద్ర, కార్యదర్శి శీలం లక్ష్మణ్, ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి థామస్ అయ్య, కళాభారతి కార్యదర్శి జి.రాంబాబు పాల్గొన్నారు.