యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం | - | Sakshi
Sakshi News home page

యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం

May 29 2025 1:19 AM | Updated on May 29 2025 1:19 AM

యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం

యువత కృషితోనే పార్టీకి పునర్వైభవం

మహారాణిపేట: కూటమి ప్రభుత్వం తమ పార్టీ కార్య కర్తలు, నాయకులపై చేస్తున్న దాడులకు, కుట్రలకు భయపడాల్సిన పనిలేదనని, ప్రతి ఒక్కరికీ పార్టీ తోడుగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఉత్తర నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే రాజు భరోసానిచ్చారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో జిల్లా యువజన విభాగం సమన్వయ సమావేశం బుధ వారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కింది స్థాయి కార్యకర్తల పట్ల అభిమానం, ప్రేమ కలిగిన నాయకుడు జగన్‌ అని, ఆయన గుండెల్లో ప్రతి కార్యకర్తను గొప్పగా నిలబెట్టాలనే ఆలోచన ఉంటుందన్నారు. 2029లో పార్టీ అధికారంలోకి వచ్చాక నూటికి నూరు శాతం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరేలా జగన్‌ 2.0 పాలన ఉంటుందన్నారు. అధికారంలోకి వచ్చాక ఏ కార్యక్రమం చేపట్టినా కింది స్థాయి కార్యకర్త ద్వారా స్థానికంగా ఉన్న ప్రజలకు లబ్ధి చేకూర్చేలా మాత్రమే కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్లు కరోనాతో ఇబ్బంది పడ్డామని, తాము ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కోర్టు కేసులు వేసేవారని ఆక్షేపించారు. మెడికల్‌ కాలేజీలు, కొత్త కంపెనీలు ఏర్పాటుచేసినా కోర్టు కేసులు వేసేవారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో లొసుగుల్ని ఆసరాగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేవారని తెలిపారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే యువత పాత్ర చాలా కీలకం అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నా జానకిరామ్‌, పి.వి.సురేష్‌, ఉరుకూటి చందు, ఇమ్రాన్‌, పార్టీ నాయకులు రవి రెడ్డి, వాసు, రాయపురెడ్డి అనిల్‌, మువ్వల సంతోష్‌, ఎల్లపు శ్రీను, వార్డు యూత్‌ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.

ఈ కష్ట కాలంలోప్రతి ఒక్కరికీ పార్టీ తోడుంటుంది

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement