బడుగుల సూర్యుడు అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

బడుగుల సూర్యుడు అంబేడ్కర్‌

Apr 29 2025 9:49 AM | Updated on Apr 29 2025 10:11 AM

బడుగుల సూర్యుడు అంబేడ్కర్‌

బడుగుల సూర్యుడు అంబేడ్కర్‌

● ఆయన రచించిన రాజ్యాగంతోనే సుపరిపాలన ● శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

తాండూరు: దళిత, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపిన సూర్యుడు డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ అని శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం పెద్దేముల్‌ మండలం కందనెల్లి గ్రామానికి చెందిన అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ప్రజాకవి జయరాజ్‌, విగ్రహదాత ముజీబ్‌ ఖాన్‌ హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు కందనెల్లి గ్రామస్తులు ఏకతాటిపైకి రావడం అభినందనీయమన్నారు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ముజీబ్‌ఖాన్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమన్నారు. అంబేడ్కర్‌ అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేందుకు రాజ్యాంగం నిర్మించారని చెప్పారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. పార్లమెంట్‌ నుంచి పంచాయతీల వరకు పరిపాలన సాఫీగా సాగడంలో ఆయన పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ సంక్షేమానికి రూ.40వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించారని గుర్తు చేశారు.

కందనెల్లిలో మహనీయుల విగ్రహాలు

మండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ..కందనెల్లిలో త్వరలో మహాత్మాగాంధీ, బా బు జగ్జీవన్‌రాం లాంటి మహనీయుల విగ్రహాల ను ఏర్పాటు చేస్తామన్నారు. యువత వారి మార్గంలో నడవాలన్నారు. అంబేడ్కర్‌ కలలను సీఎం రేవంత్‌రెడ్డి సాకారం చేస్తున్నారని కొనియాడారు.

కులగణన చేపట్టిన ఏకై క రాష్ట్రం

అనంతరం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కులగణన చేపట్టిన ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం సర్వే చేయించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదింప చేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు సబ్‌–కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ సందల్‌ రాజుగౌడ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌కుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గోపాల్‌, నాయకులు డాక్టర్‌ సంపత్‌కుమార్‌, ప్రభాకర్‌గౌడ్‌, అంబేడ్కర్‌ అసోషియేషన్‌ సభ్యులు, యువజన సంఘం సభ్యులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement