త్రివర్ణ గణపేశ్వరుడు

Ganapeswara Swamy Temple Decorated With Colors Of National Flag - Sakshi

గణపురం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో శ్రావణ సోమవారంతోపాటు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గణపేశ్వరుడిని జాతీయ పతాక రంగులతో ప్రత్యేకంగా అలంకరించారు.

ఆలయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముసునూరి నరేశ్‌స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top