
గ్రీవెన్స్డేలో 374 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్డేలో 374 వినతులు వచ్చిన ట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా క లెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యల పరిష్కారా నికి కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ప ట్టాలు కోసం 118 వినతులు, పక్కాగృహాలకు 22, ఉపాధికి 63, మౌలిక సదుపాయాలతో సహా ఇతరాలకు 92 వినతులతో కలిపి మొత్తం 374 వినతులు వచ్చాయి. వీటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు బదిలీ చేసిన కలెక్టర్ ప్రతాప్, వాటిని తక్ష ణం పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గ్రీ వెన్స్లో స్వీకరించిన వినతులపై సమీక్షించారు. ఇటీవల పూండి రిజర్వాయర్లో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుడు, రాణిపేట జిల్లాలో జరి గిన ప్రమాదంలో మృతి చెందిన బాలుడు కు టుంబానికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష వంతున చెక్కులను అందజేశారు. తాడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన సముదాయ భవనాన్ని ప ర్యవేక్షించే బాధ్యతను డ్వాక్రా మహిళకు అప్పగిస్తూ తాళాలను వారికి అందజేశారు. డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.