
చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● డ్రైవర్, కండక్టర్ సహా
నలుగురికి గాయాలు
పళ్లిపట్టు: రోడ్డుకు సమీపంలోని చెట్టును ఆర్డీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్తోపాటు నలుగురికి గాయాలయ్యాయి. పళ్లిపట్టు పోలీసుల కథనం మేరకు తిరుపతి నుంచి పాలసముద్రం మండలంలోని వెంకటరాజుకుప్పంకు ఆర్డీసీ బస్సు నడుస్తోంది. ఆ బస్సు డ్రైవర్గా తిరుపతికి చెందిన రామమూర్తి(52), కండక్టర్గా నిండ్ర మండలం ఎలకాట్టూరు గ్రామానికి చెంది ఏలుమలై(46) విధులు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పళ్లిపట్టు నుంచి వెంకటరాజుకుప్పం గ్రామానికి బస్సు వెళ్తుండగా ఆ బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. పళ్లిపట్టు–షోళింగర్ రాష్ట్ర రహదారిలోని చంద్రశేఖరాపురం వద్ద బస్సు అదుపు తప్పి రోడ్డుకు సమీపంలోని చెట్టును వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బస్సు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రామమూర్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. కండక్టర్ ఏలుమలై, పాలసముద్రం ప్రాంతానికి చెందిన ప్రయాణికులు మునుస్వామి, చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు కాపాడి 108 అంబులెన్స్ సాయంతో పళ్లిపట్టు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పళ్లిపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చైన్నె నుంచి
19 శాతం పెరిగిన వృద్ధి
సాక్షి, చైన్నె: ఓపో ఎఫ్ 29 సిరీస్ బలమైన మార్కెట్ స్పందనను నమోదుచేస్తూ, చైన్నె నుంచి 19 శాతం అమ్మకాల వృద్ధి సాధించామని ఆ సంస్థ గురువారం స్థానికంగా ప్రకటించింది. భారతదేశ శ్రామిక శక్తి కోసం తయారు చేయబడిన ఈ సీరియస్ చైన్నెలో మొదటి 21 రోజులలో అమ్మకాలను వృద్ధి పెంచిందని వివరించారు. ఈ సిరీస్ నెట్వర్క్ కనెక్టివిటీలో కొత్త బెంచ్మార్క్ను నెలకొల్పిందని పేర్కొన్నారు. ఈ సీరిస్ విభాగంలో నెట్వర్క్ కోసం ఉత్తమ పరికరాల్లో ఒకటిగా నిలిచిందని వివరించారు. ఇది డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు, గృహసేవా నిపుణులు, చిన్న వ్యాపార యజమానులకు విస్తృత సేవలు అందిస్తున్నట్టు వివరించారు.
శంకరన్కోవిల్లో రైతు హత్య
● ఇద్దరు అరెస్టు
సేలం: తెన్కాశి జిల్లా శంకరన్కోవిల్ సమీపంలో ఉన్న పెరియసామియాపురం గ్రామానికి చెందిన సింగరాజ్ కుమారుడు ఆభిరగాం (42) రైతు. ఈయన బుధవారం రాత్రి ఇంటికి సమీపంలో నిలబడి ఉండగా అక్కడికి వచ్చిన ఓ ముఠా అకస్మాత్తుగా ఆభిరగాంను చుట్టు ముట్టి కత్తులతో నరికి హత్య చేశారు.
ధన్వంతరికి ప్రత్యేక అభిషేకం
వేలూరు: కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం రాణిపేట జిల్లా వాలాజలోని శ్రీధన్వంతరి ఆరోగ్య పీఠంలోని మూలవర్ ధన్వంతరి స్వామివారికి తేనెతో అభిషేకం నిర్వహించారు. మే ఒకటో తేదీన ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ధన్వంతరి పీఠంలో ప్రతి సంవత్సరం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా గురువారం ఉదయం శ్రీధన్వంతరి ఆరోగ్య పీఠం పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామీజీ అద్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమం కోసం, ఆరోగ్యంగా ఉండాలని, కుటంబం సంక్షేమంగా ఉండాలని కోరుతూ పీఠంలోని మూలవర్కు తేనేతో అభిషేకం నిర్వహించారు.
వైభవంగా
రాధారోహణం ఊరేగింపు
కొరుక్కుపేట: చైన్నె మింట్ వీధిలోని పురాతన చరిత్ర కలిగిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో చిత్రరై ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అందులో భాగంగా తొమ్మిదో రోజు గురువారం ఉదయం శ్రీరంగనాథస్వామివార్లను వేంచేపు చేసి రాధారోహణం కనులపండువగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని శ్రీరంగనాథస్వామి కృపకు పాత్రులయ్యారు. ఇందులో ఆలయ ట్రస్టీ హరికుమార్, ఆలయ నిర్వాహకులకు భక్తులకు ప్రసాదాలు పంచి పెట్టారు.

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు