
ఫ ధాన్యం లారీల బారులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నప్పటికీ వారి చేతికి డబ్బులు వచ్చేదాక ఇబ్బందులు తప్పడం లేదు. ఐకేపీలో కాంటాలైన ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలించగా అక్కడ దిగుమతి కాక మూడు నాలుగు రోజుల వరకు బారులుదీరి నిరీక్షించాల్సి వస్తోంది. గురువారం సూర్యాపేట మండలం కాసరబాద సమీపంలోని ఓ రైస్ మిల్లు వద్ద దిగుమతి కోసం ధాన్యం లోడు లారీలు ఇలా బారులుదీరాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సూర్యాపేట