
శిశువిక్రయాల ముఠా అరెస్ట్ కలకలం
సూర్యాపేటటౌన్ : శిశువిక్రయాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడం జిల్లాలో కలకలం రేపింది. వీరిలో 13మంది సభ్యులు ఉన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు దంపతులు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల నుంచి పిల్లలను తీసుకొచ్చి సంతానం లేనివారికి అక్రమంగా దత్తత ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం 10 మంది పిల్లలను, గతంలో 28మంది శిశువులను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 10 మంది పిలలను ఎక్కడెక్కడ అక్రమంగా దత్తత ఇచ్చారో గుర్తించి పోలీసులు వాహనంలో తీసుకురాగా.. దత్తత తీసుకున్నవారు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. పిల్లలను నల్లగొండలోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.