
చెస్పోటీలు మేధాశక్తిని పెంచుతాయి
సూర్యాపేట అర్బన్ : చెస్ పోటీలు విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచుతాయని చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం టీటీడీ కళ్యాణ మండపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థులకు నిర్వహించిన చెస్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు షీల్డ్, మెమొంటోలు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. విద్యార్థులు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపెందించుకోవాలని, ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలని తెలిపారు. త్వరలోనే విద్యానగర్ లో ఉచితంగా చెస్ నేర్పించడానికి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ కుమార్, కోశాధికారి మురళి, గండూరి శ్రీధర్, దేవరశెట్టి శ్రీకాంత్, వెంకటమురళి, నర్సింగరావు, రాజశేఖర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.