
ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
చివ్వెంల(సూర్యాపేట) : జిల్లా కోర్టు ప్రాంగణంలో జూన్ 9 నుంచి 14 వరకు జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులకు సంయుక్తంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరి నోట్ కేసులు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో తీసుకున్న లోన్కు సంబంధించిన కేసులను పరిష్కరించనన్నట్లు తెలిపారు. బ్యాంకుల కార్యకలపాలు, లావాదేవీలను నిలబెట్టడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి న్యాయం చేకూర్చేలా జూనియర్ సివిల్ జడ్జిలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. నగదు చెల్లించే క్రమంలో బ్యాంకులు వడ్డీమాఫీ చేస్తాయని సూచించారు. ఇతర ఆర్థిక సంస్థలు రెండు వాయిదాల్లో చెల్లిస్తే 20 నుంచి 25 శాతం వడ్డి తగ్గిస్తాయన్నారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన శ్రీనివాస్, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, డీఎల్ఎస్ఏ సభ్యులు గుంటూరు మధు, అల్లంనేని వెంకటేశ్వర్రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలి
సూర్యాపేటటౌన్ : కేసు దర్యాప్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు అవసరమైన వివరాలు అందించడంలో బ్యాంకు అధికారులు త్వరగా స్పందించాలని ఎస్పీ కె.నర్సింహ కోరారు. సైబర్ నేరాల నివారణ, సైబర్ కేసుల దర్యాప్తుకు సంబంధించి గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు లతో కలిసి బ్యాంక్ సంస్థల కంట్రోలర్స్, రీజనల్ మేనేజర్స్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు రోజూ పెరుగుతున్నాయని, సైబర్ మోసాల నివారణకు ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులతో కలిసి బ్యాంక్ ఉద్యోగులు కృషి చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లను నిర్వాహకులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు కోరారు. జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని రామన్నగూడెం పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపాలని ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్చార్జి సూరారపు శ్రీను, రైతులు భద్రయ్య, రాములు, సంజీవ, పూల్సింగ్, రాజు, రవి, నాగయ్య పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఏకాదశిని పురస్కరించుకొని గురువారం లక్ష పుష్పార్చన పూజను పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు సుగ్రంథ పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి

ప్రత్యేక లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి