
న్యాయవాదులు అందుబాటులో ఉండాలి
చివ్వెంల: న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీపై వెళ్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణిని బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్క్లాస్ మేసిస్ట్రేట్ బి.వెంకటరమణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి శ్రీవాణి