ధరణి ఆపరేటర్లకు అందని వేతనాలు | - | Sakshi
Sakshi News home page

ధరణి ఆపరేటర్లకు అందని వేతనాలు

Apr 15 2025 1:40 AM | Updated on Apr 15 2025 1:40 AM

ధరణి ఆపరేటర్లకు అందని వేతనాలు

ధరణి ఆపరేటర్లకు అందని వేతనాలు

హుజూర్‌నగర్‌ : తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లకు ఏడాది కాలంగా వేతనాలు అందడంలేదు. దీంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేకుండా పోయిందని వారు వాపోతున్నారు.గత ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ధరణి పోర్టల్‌ను నూతనంగా ప్రవేశ పెట్టింది. అన్ని మండలాల్లో తహసీల్దార్‌లకు సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల విధులు తహసీల్దార్లకు అప్పగిస్తూ ఆయా కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి ఫీల్డ్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ (ఎఫ్‌టీఎస్‌) పేరుతో ధరణి ఆపరేటర్లను నియమించింది. వారితో పని పూర్తి చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరాక ధరణి ఆపరేటర్లకు వేతనాలు ఇవ్వలేదు.

ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1.56 లక్షల బకాయి

జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 23 ఎఫ్‌టీఎస్‌ (ధరణి ఆపరేటర్‌)లు ఒక జిల్లా కోఆర్డినేటర్‌ (డీసీ) పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ 11,900 చొప్పున ఏడాదికి రూ1.56 లక్షల వేతనం ఇవ్వాల్సి ఉంది. ఇలా జిల్లాలోని 23 మందికి కలిపి ఏడాదికి రూ 35.88 లక్షలు అవుతుంది. ఇంత మొత్తంలో బకాయి ఉండటంతో పేద, మధ్య తరగతి ఉద్యోగులకు కుటుంబాలు గడవడం ఇబ్బంది కరంగా మారింది. తమ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు స్పందించి సత్వరం వేతనాలు వచ్చేలా చూడాలని ధరణి ఆపరేటర్లు కోరుతున్నారు.

ఫ బకాయిలు రూ.35.88లక్షలు

ఫ ఏడాది కాలంగా ఎదురుచూపు

ఫ కుటుంబాలు గడవక అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement