మహాత్మా.. కదిలించు! | - | Sakshi
Sakshi News home page

మహాత్మా.. కదిలించు!

Apr 10 2025 1:51 AM | Updated on Apr 10 2025 1:51 AM

మహాత్మా.. కదిలించు!

మహాత్మా.. కదిలించు!

కోదాడ: కోదాడ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏర్పాటు చేసిన పార్కు ఆక్రమణకు గురైంది. కొందరు పూల వ్యాపారులు పార్కు స్థలాన్ని కబ్జా చేసి తమ దుకాణాలను విస్తరించారు. వాకింగ్‌ ట్రాక్‌ను సైతం ఆక్రమించేశారు. పూల వ్యర్థాలను కూడా పార్కులోనే డంపు చేస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. మున్సిపాలిటీ పరిపాలన వ్యవహారాలను చూడాల్సిన ప్రత్యేక అధికారి కనీసం చుట్టపుచూపుగా కూడా రావడంలేదన్న విమర్శలున్నాయి.

12 అడుగుల మేర లోపలికి చొచ్చుకొని వచ్చి..

కోదాడ మున్సిపాలిటీలో 80వేలకుపైగా జనాభా ఉన్నారు. కోదాడ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గాంధీ పేరిట పార్కును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. గతంలో దీన్ని కొందరు కారు పార్కింగ్‌ కోసం ఉపయోగిస్తుండగా అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ బాలోజినాయక్‌ వారిని ఖాళీ చేయించి దానిలో మొక్కలు పెట్టారు. ఈ పార్కుకు జాతీయ రహదారి వైపు కొందరు చిన్న బండ్లపై పూల వ్యాపారం చేసుకుంటారు. కొంత కాలంగా ఈ వ్యాపారులు తమ డబ్బాకొట్లను కొద్దికొద్దిగా పార్కు లోపలకు విస్తరిస్తూ దాదాపు 12 అడుగుల మేరలోపలికి చొచ్చుకొనిపోయి పక్కానిర్మాణాలు చేసుకున్నారు. ఇంతటి తో ఆగకుండా పార్కు లోపల వాకింగ్‌ ట్రాక్‌నూ కబ్జాచేశారు. దీంతో పార్కుకు వచ్చేవారు నడవకుండా అయ్యింది. పాడైపోయిన పూలు, చెత్తను పార్కులోపలే వేస్తున్నారు. పూలవ్యాపారులు తమ ద్విచక్రవాహనాలను పార్కులోపలే పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చేవారు ఇబ్బందులు పడాల్సివస్తోంది.

నిర్వహణ మరిచిన మున్సిపల్‌ అధికారులు

గాంధీ పార్కు అభివృద్ధి పేరుతో గత పాలకవర్గం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. మొదట పార్కులోపల రూ.10 లక్షలు ఖర్చు చేసి ఓపెన్‌జిమ్‌, పిల్లలు ఆడుకునే కొన్ని వస్తువులను ఏర్పాటు చేశారు. నాణ్యత లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే అవన్నీ పాడైపోయాయి. తరువాత మరో రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి పార్కులోపల మొక్కలునాటారు. గ్రీనరీతో పాటు వాకింగ్‌ ట్రాక్‌ లను ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ మరువడంతో ప్రస్తుతం పార్కులో సగం మొక్కలు చనిపోయాయి. ఇక పార్కులోపల ఏర్పాటు చేసిన మూత్రశాలలకు తాళం వేసిఉంచారు. దాన్ని తీసేనాథుడే లేడు.

పార్కు నిర్వహణకు ఒకరిని నియమించాలి

గాంధీపార్కుతో పాటు పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉత్తమ్‌ పద్మావతినగల్‌లోని పార్కు, పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండిపోతున్నాయి. గాంధీ పార్కువద్ద ఆక్రమణల విషయంలో ము న్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ కాంప్లెక్స్‌పై అనుమతి లేకుండా నిర్మాణం చేసిన షెడ్‌ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రత్యేక అధికారి మున్సిపాలిటీ విషయాలపై దృష్టిసారించాలి.

–కుదరవెళ్లి బసవయ్య, కోదాడ

కోదాడ పట్టణంలోని గాంధీ పార్కులో ఆక్రమణల జోరు

ఫ తాత్కాలికంగా కొట్లు ఏర్పాటు చేసి

ఆ తర్వాత పక్కా నిర్మాణాలు

ఫ పార్కుస్థలంలోపలి వరకు

దుకాణాల విస్తరణ

ఫ వాకింగ్‌ ట్రాక్‌ సైతం కబ్జా

ఫ చెత్త మొత్తం పార్కులోనే డంపు

ఫ చోద్యం చూస్తున్న మున్సిపల్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement