ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌

May 28 2025 12:19 AM | Updated on May 28 2025 12:19 AM

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈఏపీ సెట్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌–2025 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో ఈనెల 19 నుంచి మొదలైన ఈ పరీక్షలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లాలో ఏపీఈఏపీసెట్‌కు మొత్తం 13,298 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95 శాతం హాజరుతో 12633 మంది పరీక్షలకు హాజరయ్యారు. 655 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. వీరిలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్‌, ఫార్మశీ పరీక్షలకు 3864 మంది దరఖాస్తు చేసుకోగా 3571 మంది పరీక్ష రాశారు. మరో 293 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలకు 9434 మంది దరఖాస్తు చేసుకోగా 9062 మంది పరీక్షను రాశారు, మరో 372 మంది డుమ్మా కొట్టారు. మొత్త ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

జిల్లాలో ఏడు కేంద్రాల్లో జరిగిన ఆన్‌లైన్‌ పరీక్షలకు 95 శాతం హాజరు

దరఖాస్తు చేసిన 13,298 మందిలో 655 మంది గైర్హాజరు

విభాగం దరఖాస్తు పరీక్షకు గైర్హాజరు హాజరు

చేసింది హాజరు శాతం

ఇంజినీరింగ్‌ 9434 9062 372 96.17

అగ్రికల్చర్‌, ఫార్మసీ 3864 3571 293 92.42

మొత్తం 13298 12633 95.00

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement